వాళ్లపై పరువు నష్టం దావా వేయబోతున్న ప్రశాంత్.. ఏకంగా 50 మంది లాయర్లతో కేసు గట్టిగానే..!

by Disha Web Desk 7 |
వాళ్లపై పరువు నష్టం దావా వేయబోతున్న ప్రశాంత్.. ఏకంగా 50 మంది లాయర్లతో కేసు గట్టిగానే..!
X

దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ నిన్న బెయిల్ మీద జైలు నుండి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద జరిగిన దాడులకు, అల్లర్లకు ప్రశాంత్‌ను A1 నిందితుడిగా భావించిన చట్టం గత బుధవారం (డిసెంబర్ 20) అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు రిమాండ్‌కు తరలించారు. అయితే.. పల్లవి ప్రశాంత్ అరెస్ట్ నేపథ్యంలో యాంకర్ శివ.. ప్రశాంత్‌పై సోషల్ మీడియాలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇంటర్వ్యూ ఇస్తానని ఇంటికి పిలిచి.. తమని దారుణంగా అవమానించాడని, బూతులు తిట్టాడని ఆరోపిస్తూ వీడియోలు విడుదల చేశాడు. ఇక యాంకర్ శివతో పాటు కొంత మంది యూట్యూబర్స్ కూడా ప్రశాంత్ ఇంటర్వ్యూ ఇవ్వలేదని కావాలనే నెట్టింట నెగిటివ్ ప్రచారం చేశారని కూడా టాక్ నడుస్తోంది.

ఇక.. ప్రశాంత్ అరెస్ట్, రిమాండ్‌కు తరలించడం, బెయిల్ పై రావడం అన్ని జరిగిపోయాయి. బయటకు వచ్చిన ప్రశాంత్.. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన యాంకర్ శివతో పాటు మరి కొందరిపై పరువు నష్టం దావా వేసేందుకు ప్రశాంత్ లాయర్లు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. బెయిల్ నిమిత్తం లాయర్లతో మాట్లాడిన ప్రశాంత్.. తన ఇమేజ్‌ని డ్యామేజ్ చేసిన యాంకర్ శివ మరికొంతమంది యూట్యూబర్స్‌పై పరువునష్టం దావా వేయాలని కోరాడట. ఈ క్రమంలోనే యాంకర్ శివతో పాటు.. మరి కొందరిపై ప్రశాంత్ పరువు నష్టం దావా వేయబోతున్నట్లు అతడి కుటుంబ సభ్యులు, స్నేహితులు తెలియజేశారు. కాగా.. ప్రశాంత్ బెయిల్ ఇష్యూలో దాదాపు 50 మంది లాయర్లు అతని తరపున వాదించడానికి ముందుకు వచ్చారు.

Next Story

Most Viewed